TPT: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఫిబ్రవరి 28న జిల్లాకు రానున్నారు. మార్చి 1న దామినేడు వద్ద నూతన జిల్లా కోర్టు భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నారు. పర్యటనకు సంబంధించిన భద్రత, పారిశుద్ధ్యం, హెలిప్యాడ్, పార్కింగ్ తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు.