GNTR: గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పీఎంజేవీకే (PMJVK) పథకం ద్వారా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై MLA నసీర్ మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులతో గురువారం సమావేశమయ్యారు. కమ్యూనిటీ హాల్,శ్మశాన వాటికలు, సద్భావన్ మండప నిర్మాణాలపై చర్చించి, ప్రతిపాదనలను వేగంగా సిద్ధం చేయాలని ఆదేశించారు. మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.