NLR: ఆత్మకూరు మండలంలో జనగణన కోసం శిక్షణ ప్రక్రియ మొదట విడత పూర్తయ్యిందని తహసీల్దార్ పద్మజ కుమారి ఇవాళ తెలిపారు. మొత్తం 69 మందితో జనగణన నిర్వహిస్తుండగా తొలి శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బందితో కొన్ని ఇళ్ల వద్ద వారి వివరాలతో ట్రయల్ నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ప్రతి ఇంట్లో నివసించేవారి వివరాలను నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు.