సత్యసాయి: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మండిపడ్డారు. శనివారం అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలని వైసీపీకి సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 190 రోజుల్లోనే సీమకు 40 టీఎంసీల కృష్ణా జలాలను అందించామని పేర్కొన్నారు.