ASR: డుంబ్రిగూడ మండలం జామగూడ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి భోజనం, విద్యాబోధన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో సుమారు 520 మంది విద్యార్థులు ఉండగా మధ్యాహ్న భోజనానికి కేవలం 100 మందికి సరిపడా కూర మాత్రమే వడ్డిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.