E.G: రాజమండ్రిలోని బర్మా కాలనీ వద్ద శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పుష్కరాల రేవు వద్ద సూలాల పండుగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరై పూజలు నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు.