BPT: జూనియర్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో జిల్లా కొత్త మైలురాయిని చేరుకుంది. కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రకారం 387 పాఠశాలలు, 60 కళాశాలల నుంచి మొత్తం 1,06,007 మంది విద్యార్థులు సభ్యులయ్యారు. ఈ విజయంతో డీఈవో శ్రీనివాస్ సింగ్ను సత్కరించారు. ప్రతి నెల 30న రిటైర్డ్ ఉద్యోగులను గౌరవించే కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.