WG: పేరుపాలెం బీచ్కు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి కుటుంబ సమేతంగా సముద్ర స్నానాలు చేస్తూ ఆహ్లాదంగా గడిపారు. తీరంలోని ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొబ్బరి తోటల్లో వన భోజనాలు ఏర్పాటు చేసుకుని సరదాగా గడిపారు. పర్యాటకుల రాకతో తీర ప్రాంతంలో సందడి నెలకొంది.