తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ నెల 3న చంద్రగ్రహణం కారణంగా, 2, 3 తేదీలకు సంబంధించిన దర్శన టోకెన్లను జారీ చేయబోమని స్పష్టం చేసింది. 4వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకెన్లను 3న జారీ చేస్తారు. భక్తులు ఈ మార్పులను గమనించాలని అధికారులు సూచించారు.