ప్రకాశం: రేపటి నుంచి 12 రోజులపాటు జరిగే జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎర్రగొండపాలెం జనసేన నాయకుడు పాకనాటి పృథ్వీరాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ కోసం శ్రమించే కార్యకర్తలకు అండగా ఉండడమే పవన్ ఆశయమని, సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్తకు పార్టీ తరఫున ప్రమాద బీమా రక్షణగా ఉంటుందన్నారు.