BPT: చీరాల నియోజకవర్గవ్యాప్తంగా శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వేటపాలెం, ఈపురుపాలెం ప్రాంతాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండయ్య స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.