అనంతపురం నగరపాలక సంస్థ, జిల్లాలోని పురపాలక సంఘాల పాలకవర్గాల గడువు నేటితో ముగిసింది. దీంతో రేపటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో కార్యకలాపాలు జరగనున్నాయి. అనంతపురం నగరపాలక సంస్థకు కలెక్టర్ ఆనంద్, తాడిపత్రి మున్సిపాలిటీకి జేసీ విష్ణుచరణ్ ప్రత్యేక అధికారులుగా వ్యవహరించనున్నారు. మిగతా మున్సిపాలిటీల బాధ్యతలను ప్రభుత్వం ఆర్డీవోలకు అప్పిగించింది.