KRNL: మంత్రాలయం రాఘవేంద్ర కూడలిలో ఎస్సై మల్లికార్జున సిబ్బందితో కలిసి సోమవారం సాయంత్రం ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. వాహనదారులు తప్పనిసరిగా ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. నిషేధిత వస్తువుల రవాణాపై హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి, సరైన ధ్రువపత్రాలు లేని పలు వాహనాలకు జరిమానా విధించామన్నారు.