కాకినాడ వైసీపీ జిల్లా అధ్యక్షుడు తుని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా సోమవారం సీఎం నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. స్వర్గీయ వంగవీటి మోహన రంగ హత్య వ్యవహారంలో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రంగ హత్య కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు ప్రస్తుతం CM పక్కనే ఉన్నారని ఆరోపించారు.