KRNL: కర్నూలు రేంజ్ పరిధిలో అర్ధరాత్రి భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. 25 మంది సీఐలను బదిలీ చేస్తూ డీఐజీ డా. కోయప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాలలో ఈ పోస్టింగ్లు ఇచ్చినట్లు వెల్లడించారు. పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సిఫార్సుల మేరకు కొందరిని వీఆర్కు పంపామన్నారు.