అన్నమయ్య: వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లిన ఓ రైతు పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటన బి.కొత్తకోట మండలంలో విషాదం నింపింది. గట్టు గ్రామానికి చెందిన బాబు (60) సోమవారం తన పొలంలో కూరగాయల పంటలో కలుపు తీస్తుండగా పాము కాటేసింది. కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.