NLR: ఈనెల 25న నెల్లూరుకు ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ రానున్నట్లు జిల్లా పౌర సంబంధాల సమాచార శాఖ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఉ.10.30 గంటలకు నెల్లూరులోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహానికి చేరుకుంటారు. అనంతరం ఉ.11.00 గంటల నుంచి కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో పోష్ యాక్టు -2013 పై జరిగే వర్క్ షాపులో పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు.