BPT: పిట్టలవానిపాలెం మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోందని స్థానికులు అంటున్నారు. పక్క నియోజకవర్గం నుంచి ఇక్కడికి యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారని, ఇసుక వాహనాలు అతి వేగంతో, పరిమితికి మించిన లోడుతో వెళ్తున్నాయని పేర్కొన్నారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.