GNTR: చేబ్రోలులోని బొమ్మలగుడి వద్ద శనివారం ఆధ్యాత్మిక శోభ నెలకొంది. అక్కడి రామమందిరంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ సీతారాముల పటాన్ని, అభయ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ హాజరయ్యారు. ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.