కృష్ణా: గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో ఇంటి పన్ను వసూళ్ల పురోగతిని ఎంపీడీవో ఇమ్రాన్ శుక్రవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి సంబంధించి ఆదాయ వనరులను సమయానికి వసూలు చేసి, పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.