VSP: సింహాచలం చందనోత్సవం సందర్భంగా విధులు నిర్వహించబోయే పోలీస్ సిబ్బందితో సీపీ శంఖబ్రత బాగ్చి సమీక్ష నిర్వహించారు. భక్తులతో మర్యాదగా వ్యవహరిస్తూ అవసరమైనప్పుడు వెంటనే సహాయం అందించాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మొత్తం 2,300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి, డ్రోన్ సాంకేతికతను వినియోగిస్తున్నట్టు తెలిపారు.