PPM: సీతానగరం మండలం జోగింపేట అంబేద్కర్ గురుకులంలో పిల్లలకు గురువారం ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా MLHP నవీన్ జ్వరం, జలుబు, దగ్గు, స్కిన్ ఎలర్జీ, హీమోగ్లోబిన్ వంటి పరీక్షలు చేశారు. అనంతరం అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. అలాగే, పిల్లలకు పౌష్టిక ఆహారం, నిద్ర, వ్యక్తిగత, మరుగుదొడ్ల పరిశుభ్రత, హ్యాండ్ వాషింగ్పై అవగాహన కల్పించారు.