కృష్ణా: కంకిపాడు మండలం ఈడుపుగల్లు లోని సీతారామ కళ్యాణ మండపంలో ఆశ వర్కర్లు, అంగన్వాడీ సిబ్బందితో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సోమవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్త్రీగా సమాజంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, కుటుంబ సభ్యులు పిల్లల ఎదుగుదలకు, భర్త విజయం వెనుక ఆమె కృషి సాటి లేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.