NDL: ఉమ్మడి రాష్ట్రానికి వెలుగులు ఇచ్చిన ముంపు బాధితుల న్యాయమైన హక్కులు (98GO) పరిష్కరించాలని రాయలసీమ సాగునీటి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి డిమాండ్ చేశారు. నేడు నందికొట్కూరులో 5వ రిలే నిరాహార దీక్షలు చేపట్టిన బాధితులకు సంఘీభావం తెలిపారు. జీఓ 98 ప్రకారం ఉద్యోగాలు కల్పించాలని, లేకుంటే ఉద్యమ బాట పడతమన్నారు. ఇందులో రైతు సంఘం నాయకులు ఉన్నారు.