పల్నాడు: డ్రాప్ అవుట్ లేకుండా బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలని ధరణికోట గ్రామం ఎంపీపీ హెచ్ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. 5 సంవత్సరాలలోపు పిల్లలను అంగన్వాడీ స్కూలుకు పంపించాలన్నారు. 6 సంవత్సరాలు వచ్చిన చిన్నారులను ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలని కోరారు. డ్రాప్ అవుట్ లేకుండా విద్యను అభ్యసించాలని కోరారు.