బాపట్ల: పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో గంజాయి తాగుతూ.. అమ్ముతున్న 29 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఉమామహేశ్వర్, డీఎస్పీ చంద్రమౌళి ఈ వివరాలను వెల్లడించారు. గంజాయి ముఠాను చాకచక్యంగా పట్టుకున్న పట్టణ సీఐ రాంబాబు, ఎస్సైలు విజయ్ కుమార్, నస్రీన్, ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా వారికి నగదు బహుమతులు అందజేశారు.