VZM: జిల్లాలో రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలను అందిచటమే లక్ష్యమని జిల్లా డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. బుధవారం మినిస్టరీ ఆఫ్ పవర్ అనుబంధ సంస్థ ఈఈఎస్ఎల్ (EESL) ప్రతినిధులతో డీసీసీబీ కార్యాలయంలో ఆయన సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో డీసీసీబీ-ఈఈఎస్ఎల్ సంస్థల మధ్య అవగాహన ఒప్పందాలు (MOUలు) చేసుకున్నామని తెలియజేశారు.