KDP: ప్రొద్దుటూరు స్థానిక రామేశ్వరంలోని ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయం దక్షిణ కాశీగా పేరుపొందింది. ఇక్కడ స్వయంగా శ్రీరాముడు సైకత లింగాన్ని ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయానికి 90.31 ఎకరాల భూములు ఉన్నాయి. భూముల నుంచి కౌలు రూపంలో రూ.5,47,800లు ఆదాయం వస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆలయానికి రూ.13,26,284ల ఆదాయం లభించినట్లు ఈవో శ్రీధర్ తెలిపారు.