CTR: చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలో అక్రమ మైనింగ్, రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఆకస్మిక తనిఖీల్లో పత్రాలు లేకుండా గ్రానైట్ తరలిస్తున్న ఒక లారీతో పాటు అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.