W.G: వరి సాగులో రైతులు యూరియా వాడకాన్ని తగ్గించాలని సహాయ వ్యవసాయ సంచాలకులు కే.శ్రీనివాసరావు సూచించారు. శనివారం మోగల్లు రైతు సేవా కేంద్రంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. అధిక ఎరువుల వినియోగంతో భూసారం దెబ్బతింటుందని హెచ్చరించారు. వేసవిలో సేకరించే మట్టి నమూనాల ఫలితాల ఆధారంగానే ఎరువులు వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏవో సంధ్య, రైతులు పాల్గొన్నారు.