కృష్ణా: పేదల కష్టాన్ని చూసి చలించే నేత పవన్ కళ్యాణ్ అని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఇవాళ అవనిగడ్డ కోర్టు సెంటర్లో జనసేన జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, ఏఎంసీ వైస్ ఛైర్మన్ రాజనాల వీరబాబు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే జనసేన పార్టీ జెండా ఆవిష్కరించి, చలివేంద్రాన్ని ప్రారంభించి కేక్ కట్ చేశారు.