GNTR: రాజధాని అమరావతి అభివృద్ధి పనుల కోసం ఏపీ ప్రభుత్వం రూ.1,400 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణాల ద్వారా వచ్చే ఈ నిధులను 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేటాయించారు. ఈ మొత్తాన్ని సీఆర్డీఏ పీడీ ఖాతాలో జమ చేయనున్నారు.