కృష్ణా: ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలోని డీఎంహెచ్ఓ కార్యాలయం ముందు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ యుగంధర్ అవగాహన ర్యాలీని మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఈ ర్యాలీలో పాల్గొని, క్షయవ్యాధి నివారణ, చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.