అన్నమయ్య: మదనపల్లి సంతపేటలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు మహా యజ్ఞం శిబిరాన్ని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ ప్రారంభించారు. రూ.400తో సభ్యత్వ నమోదు చేసి రూ.5 లక్షల ప్రమాద బీమా సదుపాయం ఉంటుందని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా శిబిరాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో సభ్యత్వం పొందాలని నాయకులు పిలుపునిచ్చారు.