VSP: మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ శ్రీభరత్ అధికారులను ఆదేశించారు. గతంలో మంజూరైన రూ.13.5 కోట్లలో కొంతమేర పనులు మాత్రమే పూర్తయ్యాయని తెలిసి ఆయన పాఠశాలను సందర్శించారు. ఈమేరకు ప్రిన్సిపాల్, విద్యార్థులతో మాట్లాడి పరిస్థితులను పరిశీలించారు.