E.G: ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో శనివారం కమిషనర్ రాహుల్ మీనా కీలక ప్రకటన చేశారు. ఆదివారం సెలవు రోజైనప్పటికీ ఆస్తి, ఖాళీ స్థలం పన్నులు, నీటి ఛార్జీల చెల్లింపునకు కౌంటర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. నగరపాలక సంస్థ ట్రెజరీలో పన్నులు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఆన్లైన్ లేదా సమీప సచివాలయాల్లో చెక్కుల ద్వారా కూడా పన్నులు కట్టే వెసులుబాటు కల్పించారు.