KDP: జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు కాలనీలు, గ్రామాల్లో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలు, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర హెల్ప్లైన్ నంబర్లను గుర్తు చేశారు. సోషల్ మీడియా, ఆన్లైన్ మోసాల విషయంలో జాగ్రత్తలు పాటించాలని అవగాహన కల్పించారు.