PLD: చిలకలూరిపేట 37వ వార్డులో మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు, కౌన్సిలర్ శివకుమారితో కలిసి శనివారం పింఛన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఒక రోజు ముందుగానే నగదు అందజేయడంపై వృద్ధులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పంపిణీ ప్రక్రియను కమిషనర్ స్వయంగా పర్యవేక్షించారు.