AKP: అచ్యుతాపురం KGBVలో ఏడవ తరగతి విద్యార్థిని మైలపల్లి నవ్య మృతి చెందిన ఘటనపై ప్రిన్సిపల్ ఉమా దేవితో పాటు నలుగురిని సస్పెండ్ చేసినట్లు డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. బాలిక మృతిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు కేజీబీవీ గేటు వద్ద ఆందోళన చేశారు. సస్పెండ్ అయినవారిలో ఎన్.ఎస్. టీచర్ సునీత, ఒకేషనల్ టీచర్ రూప, వాచ్ ఉమెన్ చిలకమ్మ, ఏఎన్ఎం ఈశ్వరి ఉన్నారు.