కృష్ణా: కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం నాగాయలంక మండలం సంగమేశ్వరంలో రూ.23.94 లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీసీ ఛైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, ఏఎంసీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.