ATP: ఈనెల 25న జరగనున్న పాలిసెట్-2026 ప్రవేశ పరీక్షను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో ఎ. మాలోల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 31 కేంద్రాల్లో 9,745 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని సూచించారు.