SKLM: జిల్లాలో ఏప్రిల్ 23 నుంచి వడగాల్పులు తీవ్రమయ్యే అవకాశం ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం ఓప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం, రాజాం, ఆముదాలవలస సహా పలు మండలాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.