నెల్లూరులోని కోటమిట్ట జంక్షన్ పరిధిలో బుధవారం వన్ టౌన్ పోలీసులు భారీగా తనిఖీలు చేపట్టారు. 45 మంది సిబ్బందితో 300 ఇళ్లను తనిఖీ చేసిన పోలీసులు, సరైన పత్రాలు లేని 21 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా ఈ తనిఖీలు చేపట్టామన్నారు. గంజాయి, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని పోలీసులు హెచ్చరించారు.