E.G: ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో పూర్తి నిజాలు బయటపెట్టాలని షెడ్యూల్ క్యాస్ట్ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ డిమాండ్ చేశారు. గోకవరం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతూ, ఘటనను ప్రమాదంగా చూపించే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. కేసులో సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.