KDP: కమలాపురంలో శనివారం బీజేపీ నేత గోవిందు రైతులతో కలిసి వారి పొలాలను సందర్శించారు. వారి సమస్యలు, పంట పరిస్థితులు, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు గురించి తెలుసుకున్నారు. రైతు సంక్షేమం దేశ అభివృద్ధికి పునాది అని, రైతుల కష్టాలు తగ్గేలా ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు. బీజేపీ ఎప్పుడూ రైతుల పక్షాన నిలబడుతుందని ఆయన చెప్పుకొచ్చారు.