CTR: చిత్తూరు 1 టౌన్ పోలీసులు అదృశ్యమైన ఇద్దరు మైనర్ బాలికల కేసును 48 గంటల్లోనే ఛేదించి, వారిని సురక్షితంగా రక్షించారు. సోషల్ మీడియా పరిచయాలతో బాలికలు వెళ్లినట్లు విచారణలో తేలింది. తల్లిదండ్రులు తమ పిల్లల మొబైల్ వినియోగంపై నిరంతరం నిఘా ఉంచాలని, సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. సకాలంలో స్పందించిన పోలీసులను బాధితుల తల్లిదండ్రులు అభినందించారు.