KRNL: నిరుద్యోగ యువతకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) మంచి అవకాశం కల్పిస్తోందని జిల్లా అధికారి రాజ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27న (శుక్రవారం) ఉదయం 10 గంటలకు కర్నూలు అబ్బాస్ నగర్లోని రవీంద్ర మహిళా డిగ్రీ కళాశాలలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాల జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని ఆయన సూచించారు.