ASR: చింతపల్లి మండలం పెంటపాడు జాతీయ రహదారిపై ఉన్న వంతెన రెయిలింగ్ను కారు ఢీకొన్న ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.కేడిపేట పాతూరు నుంచి చింతపల్లి వస్తున్న కారు ఆదివారం తెల్లవారుజాము 2 గంటల సమయంలో పెంటపాడు వంతెన రెయిలింగ్ను ఢీకొట్టింది. కారులో ఉన్న పృథ్వీ, శివ, జస్వంత్, ప్రవీణ్ గాయాల పాలయ్యారు. గాయాలపాలైన వారిని 108లో చింతపల్లి హాస్పిటల్కి తరలించారు.