సత్యసాయి: అగళి మండలం ఇరిగేపల్లి పంచాయతీ వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి సమక్షంలో పంచాయతీ అధ్యక్షుడు ప్రకాష్ యాదవ్, గురులింగప్ప, లక్ష్మీకాంత, చిక్కన్న వైసీపీకి రాజీనామా చేసి పసుపు కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి డి.విశ్వనాధ్ యాదవ్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.