ELR: పీ.ఆర్ 126 రకం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, నాణ్యమైన గోనె సంచులు అందించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ కోరారు. శనివారం భీమడోలు మండలం గుండుగొలను సొసైటీ వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యే ధర్మరాజును కలిసి రైతు సంఘం నాయకులు సమస్యను వివరించారు.